ఆదిపూడి (కారంచేడు): ప్రభుత్వ పథకాలతో పాటు, స్వచ్ఛంద సంస్థల సహకారం గ్రామీణాభివృద్ధికి ఎంతో చేయూతనిస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ మాజీ సర్పంచ్ కారుమూడి సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం ఫిల్టర్బెడ్ భూమిపూజలో మాట్లాడారు. రోటరీ క్లబ్ ఆఫ్ పర్చూరు సెంట్రల్ పర్చూరు వారి సౌజన్యంతో సుమారు రూ. 5 లక్షలతో నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నామన్నారు. క్లబ్ అధ్యక్షులు నాగభైరు శ్రీనివాసరావు మాట్లాడుతు ఈ వాటర్ ప్లాంట్ను మరో 7 సంవత్సరాలు నిర్వహించాలని పంచాయతీ నుంచి వచ్చిన విన్నపం దృిష్టిలో ఉంచుకొని రోటరీ క్లబ్ అనుబంధ సంస్థ అయిన సపోర్టు వారి సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. కార్యదర్శి సదానందరెడ్డి, పి. వెంకటేశ్వర్లు, సపోర్టు ప్రెసిడెంట్ పోలిశెట్టి చంద్రశేఖరరావు, కాసా ఆశోక్, గ్రామస్తులు పాల్గొన్నారు.