చలో మైసూర్‌

20 Nov, 2023 00:19 IST|Sakshi

హీరో రామ్‌చరణ్‌ కొన్ని రోజులు మైసూర్‌కు మకాం మార్చనున్నారట. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘గేమ్‌చేంజర్‌’. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ మైసూర్‌లో జరిగేలా చిత్రయూనిట్‌ ప్లాన్‌ చేసిందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

ఈ నెల చివర్లో జరగనున్న ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించేలా శంకర్‌ ప్లాన్‌ చేశారట. అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, నవీన్‌చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ‘గేమ్‌చేంజర్‌’ వచ్చే ఏడాది విడుదల కానుంది.

మరిన్ని వార్తలు