స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యం

16 Nov, 2023 01:02 IST|Sakshi
వేడుకల్లో పాల్గొన్న వీసీ ప్రసాదరెడ్డి
ఏయూ వీసీ ప్రసాదరెడ్డి

ఏయూక్యాంపస్‌: స్వయం సమృద్ధి సాధించే దిశగా ఏయూను నడిపించడమే లక్ష్యంగా అందరూ సమ ష్టిగా పనిచేయాలని వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసా దరెడ్డి పిలుపునిచ్చారు. నాక్‌ ఏ డబుల్‌ ప్లస్‌ గ్రేడ్‌ సాధించిన నేపథ్యంలో బుధవారం పరిపాలన భవనం ఎదురుగా కేక్‌ కట్‌ చేసి వేడుకలు నిర్వహించా రు. ఏయూపరిపాలన భవనంలో పనిచేస్తున్న ఐదు వందల మందితో కలిసి ఈ విజయాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ వర్సిటీ చుట్టూ ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్‌ పార్క్‌లు భవిష్యత్‌లో ఏయూకు ఆర్థిక వనరులుగా మారతాయన్నారు. వర్సిటీ ఆచార్యులు, ఉద్యోగులు, విద్యార్థులు వర్సిటీ నాది అనే భావనతో పనిచేయడం తాను గమనించానన్నారు. నాలుగేళ్ల పటిష్ట ప్రణాళిక మంచి ఫలితాన్ని అందించిందన్నారు. విభిన్న శాఖలు కలిగిన ఏయూ 3.74 సీజీపీఏ సాధించడం ఓ రికార్డ్‌గా నిలుస్తుందన్నారు. పూర్తిస్థాయిలో వర్సిటీని అభివృద్ధి చేయడానికి అవసరమైన శక్తి.. రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూపంలో తనకు లభించిందన్నారు.ఈ సందర్భంగా టపాసులు కాల్చి వేడుకలు జరుపుకున్నారు.

మరిన్ని వార్తలు