సీఎం జగన్‌ కలలు సాకారమవుతున్న వేళ..

27 Oct, 2023 04:36 IST|Sakshi

ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌తో చదువుకున్న 9 మందికి అమెజాన్‌లో కొలువు 

అగనంపూడి (గాజువాక): ప్రతీ పేదింటి బిడ్డ ఉన్నత చదువుల్లో రాణించాలని..ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని సీఎం జగన్‌ తపన..ఆరాటం సఫలీకృతమవుతు­­ం­డటం సంతోషంగా ఉందని విజ్ఞాన్‌ విద్యా సంస్థల చైర్మన్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్‌ లావు కృష్ణదేవరాయలు అన్నారు. అమెజాన్‌ ప్రాంగణ ఎంపిక ప్రక్రియలో ఎంపికైన 13 మందిలో 9 మంది విద్యార్థులు ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌తో చదువు­కు­న్నట్లు తెలిపారు.

వీరికి వార్షిక వేతనం రూ.26 లక్షలు అని చెప్పారు. వీరితో­పాటు మరో 13 మంది కూడా 3 సంస్థల్లో ఉద్యోగాలు సాధించినట్లు తెలిపారు. ఒకరు రూ.12 లక్షల వార్షిక వేతనం, 12 మందికి రూ.10 లక్షల ప్యాకేజీతో దేవ­రెవ క్లౌడ్‌ ఇండియా, ఇన్సిర్క్స్, ఎటర్నల్‌ రోబోటిక్స్‌ సంస్థల్లో ఉద్యోగాలు పొందినట్లు వివరించారు.

కళాశాలలో చేరిన తొలి ఏడాది నుంచి విలువలతో కూడిన విద్యతో పాటు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ కోసం ప్రత్యేక శిక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకు­ంటున్నామన్నారు. సాఫ్ట్‌ స్కిల్స్, టెక్నికల్‌ స్కిల్స్, కోడింగ్‌ స్కిల్స్‌తోపాటు వి­ద్యా­­ర్థులను మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉంచడటంతోపాటు నైతిక వి­లు­వలూ పెంపొందిస్తున్నామని చెప్పారు. విజ్ఞాన్‌ సీఈవో ఎన్‌.శ్రీకాంత్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు