సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 31,072 కరోనా పరీక్షలు నిర్వహించగా, 1,730 మందికి పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 9,07,676 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
గడచిన 24 గంటల్లో 842 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 8,90137 డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో కరోనా వైరస్ బారినపడి చిత్తూరులో ముగ్గురు.. నెల్లూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు మృతి చెందగా, ఇప్పటివరకు 7,239 మరణించారు. ఏపీలో ప్రస్తుతం 10,300 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటివరకు 1,52,08,436 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
చదవండి:
పెళ్లి వేడుకలో కరోనా కలకలం..
వినూత్న ప్రచారం: ఇది మీరు కూడా చేయగలరు!