ఎన్‌జీ రంగా వర్సిటీలో పరిశోధనలు భేష్‌

25 Jan, 2024 11:45 IST|Sakshi

ల్లూరు(సెంట్రల్‌): నెల్లూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ పరిశోధనా క్షేత్రంలోని పరిశోధనలు చాలా బాగున్నాయని, అమెరికాలోని టెన్నెసీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్స్‌ దిలీప్‌ నందు వాణి, ప్రొఫెసర్‌ జాన్‌ రికార్డ్స్‌ ప్రశంసించారు. నెల్లూరు నగరంలోని పరిశోధనా క్షేత్రాన్ని బుధవారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లా­డుతూ ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ పరిశోధనా స్థానాలను తాము పరిశీలించామని, అన్నిచోట్ల చాలా బాగు­­న్నాయని కొనియాడారు. అదేవిధంగా నెల్లూ­రు­లో ఉన్న ఎన్‌జీ రంగా పరిశోధనా క్షేత్ర­ంలో పరిశోధనలు తమకు ఎంతో సంతృప్తినిచ్చా­యని వివరించారు.

తమ ప్రాంతంలో ఉన్న విద్యార్థులను కూడా నెల్లూరులోని పరిశోధనా క్షేత్రానికి పంపి ఇక్కడి స్థితిగతులను తెలుసుకునేలా చేస్తామన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కోదండరామిరెడ్డి, డాక్టర్‌ గురవారెడ్డి, డాక్టర్‌ సి.రమణ, ప్రధాన శాస్త్రవేత్త వినీత ఈ బృందానికి క్షేత్రంలో చేస్తున్న పరిశోధనల­ను వివరించారు. ప్రధానంగా కొత్త వంగడాలు, తెగుళ్ల నివారణపై కూలంకషంగా వివరించారు.

whatsapp channel

మరిన్ని వార్తలు