24 గంటల్లో ఏపీలో 478 కేసులు

16 Dec, 2020 18:29 IST|Sakshi

హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసిన ఆరోగ్య శాఖ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 64,099 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 478 మందికి పాజిటివ్‌గా తెలింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 8, 76, 814గా ఉంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. 

గడచిన 24 గంటల్లో 715 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ అవ్వగా.. గత 24 గంటల్లో విశాఖపట్నంలో ఇద్దరూ, వైఎస్సార్‌ కడపలో ఒక్కరు కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 7,067కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,420 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నేటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1, 10, 01, 476 శాంపిల్స్‌ను పరీక్షించారు. 

Poll
Loading...
మరిన్ని వార్తలు