వైఎస్సార్‌సీపీలో చేరిన చందన రమేష్‌

22 Aug, 2020 09:15 IST|Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ నేత, రాజమండ్రి రూరల్‌ మాజీ ఎమ్మెల్యే చందన రమేష్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో చందన రమేష్, ఆయన తనయుడు నాగేశ్వర్‌లు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా చందన రమేష్, ఆయన కుమారుడు నాగేశ్వర్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు