జ్యోతి సురేఖకు సీఎం అభినందన

24 Aug, 2023 03:18 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రపంచ ఆర్చరీ విజేత వెన్నం జ్యోతి సురేఖను సీఎం వైఎస్‌ జగన్‌ అభి­నందించారు. ఆమె బుధవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌­మోహన్‌­రెడ్డిని కలిశారు. ఇటీవల బెర్లిన్‌లో జరిగిన వరల్డ్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్, పారిస్‌లో జరిగిన ఆర్చరీ వరల్డ్‌ కప్‌లో సాధించిన పతకాలను సీఎంకు చూపించారు.

సీఎం జగన్‌ మాట్లాడుతూ..అంతర్జాతీయ వేదికలపై అద్భుత ప్రదర్శనతో సురేఖ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిందని ప్రశంసించారు. ప్రభు­త్వం తరఫున క్రీడాకారులకు పూర్తి సహాయ సహ­కారాలు అందిస్తున్నామని చెప్పారు. భవిష్య­త్తులోనూ ఇదే స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం సురేఖ తనకు డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం ఇచ్చినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె తండ్రి వెన్నం సురేంద్ర కుమార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు