తలశిల రఘురామ్‌ కుమార్తె వివాహ వేడుకకు సీఎం జగన్‌ దంపతులు

6 Dec, 2023 14:55 IST|Sakshi

సాక్షి, విజయవాడ: శాసనమండలి సభ్యుడు తలశిల రఘురామ్‌ కుమార్తె వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఎ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన వేడుకలో వధువు ప్రణవ, వరుడు విష్ణులను సీఎం జగన్‌, వైఎస్‌ భారతి దంపతులు ఆశీర్వదించారు.

ఈ వివాహ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు హాజరయ్యారు.

>
మరిన్ని వార్తలు