ఏపీలో 8,012 పాజిటివ్‌‌, 88 మంది మృతి

16 Aug, 2020 19:46 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటలో 48,746 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 8,012 పాజిటివ్‌గా తేలింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,89,829కు చేరింది. వైరస్‌ నుంచి తాజాగా 10,117 మంది బాధితులు కోలుకుని ఆదివారం డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 2,01,234కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 85,945 యాక్టివ్‌ కేసులున్నాయి. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 88 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2650కు చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. కాగా, రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 28,60,943 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వైద్యారోగ్యశాఖ తెలిపింది. (‘కరోనా’ అంత్యక్రియల్లో భూమన కరుణాకర్‌రెడ్డి)


 

మరిన్ని వార్తలు