8,827 మంది డిశ్చార్జ్‌

22 Aug, 2020 03:54 IST|Sakshi

తాజాగా 9,544 మందికి పాజిటివ్‌

సాక్షి, అమరావతి: గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 8,827 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 2,44,045కు చేరింది. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 వరకు 55,010 మందికి పరీక్షలు నిర్వహించగా 9,544 మందికి పాజిటివ్‌గా తేలినట్టు వైద్యారోగ్యశాఖ శుక్రవారం బులెటిన్‌లో పేర్కొంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,34,940కి చేరింది. మొత్తం 31,29,857 పరీక్షలు నిర్వహించారు. తాజాగా 91 మంది మృతితో మొత్తం మరణాలు 3,092కి చేరాయి. యాక్టివ్‌ కేసులు 87,803. 

మరిన్ని వార్తలు