ఏపీలో కొత్తగా 1,190 కరోనా పాజిటివ్‌ కేసులు

12 Sep, 2021 18:37 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో  గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,190 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 11 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 45,533 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం బులెటిన్‌ను విడుదల చేసింది. వైరస్‌ నుంచి 1,226 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 20,00,877 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారినపడి ఇప్పటివరకు 13, 998 మంది మృతి చెందారు. 


చదవండి: సెక్యూరిటీ గార్డే డాక్టరైండు.. పేషెంట్‌కు ఇంజెక్షన్‌

మరిన్ని వార్తలు