వరద బాధితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుంది: మంత్రి పెద్దిరెడ్డి

2 Dec, 2021 15:45 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా చంద్రబాబు రాజకీయాలే చేస్తారని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు పర్యటనలో అడుగడుగునా టీడీపీ జెండాలే కనిపించాయని విమర్శించారు. తమ నాయకుడు.. సీఎం జగన్‌ చిత్తూరు పర్యటన నేపథ్యంలో తాము.. ఎక్కడా ​కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయలేదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.

టీడీపీ నేతలు.. ప్రచారం కోసం మాత్రమే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని ఎద్దేవా చేశారు. వరదలలో నష్టపోయిన బాధితులను తమ ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు