Genome Sequencing Lab: అందుబాటులోకి జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్

3 Jan, 2022 21:36 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. విజయవాడ సిద్దార్ధ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో ఈ ల్యాబ్‌ ఏర్పాటైంది. ఒమిక్రాన్ నిర్ధారణ కోసం రెండు కోట్ల రూపాయలకుపైగా వ్యయంతో ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రాలలో కేరళ తర్వాత ఏపిలోనే ఈ ల్యాబ్ ఏర్పాటైంది. ఇప్పటివరకు ఒమిక్రాన్ నిర్థారణకి శాంపిల్స్‌ని పూణే, హైదరాబాద్ సీసీఎంబికి వైద్య ఆరోగ్యశాఖ పంపించేది. ఇప్పుడు విజయవాడలోనే సాంకేతిక ల్యాబ్‌ అందుబాటులోకి వచ్చింది.

చదవండి: ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలి.. ప్రధానితో సీఎం జగన్‌

సోమవారం నుంచి జీనోమ్ సీక్వెన్సింగ్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. గత వారం రోజులుగా అధికారులు ట్రైయిల్‌ రన్ నిర్వహించారు. డెల్టా, ఓమిక్రాన్ మొదలైన కోవిడ్-19ల ఉత్పరివర్తనలు, రూపాంతరాలను ఇక్కడ ల్యాబ్‌లో గుర్తించే సదుపాయం ఉంటుంది. ల్యాబ్ పనితీరులో సీఎస్‌ఐఆర్‌, సీసీఎంబీ హైదరాబాద్‌ సాంకేతిక సహకారాన్ని అందిస్తుందని వైద్య అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు