పక్షుల నియంత్రణకు స్ప్రేడ్రోన్‌

21 Mar, 2024 04:40 IST|Sakshi

విమానాల రాకపోకలకు పక్షులు తీవ్ర అంతరాయాన్ని కలిగిస్తున్నాయి. దీంతో తూర్పు నౌకాదళంలోని వైమానిక బృందం వినూ­త్న విధానాల్ని అమల్లోకి తీసుకొచ్చింది. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం, నేవల్‌ ఎయిర్‌ స్టేషన్‌ ఐఎన్‌ఎస్‌డేగా పక్కపక్కనే ఉన్నాయి. వీటి పక్కనే మడ అడ­వు­లు విస్తరించి ఉన్నాయి. అక్కడ నుంచి పక్షులు రాకపోకలు పెరుగుతుండటంతో.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

నేవల్‌ ఫ్లైట్స్‌ కూడా ఎగిరేందుకు అంతరాయం కలుగుతున్న తరు­ణంలో ఈ సమస్యని పరిష్కరించేందుకు నేవల్‌ ఏవియేషన్‌ అధికారులు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. స్ప్రే డ్రోన్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చా­రు.

ఐఎన్‌ఎస్‌ డేగా నుంచి వీటి ఆపరేషన్స్‌ నిర్వహించి.. పక్షులు ఎగరనీయకుండా నియంత్రించనున్నారు. ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న చెట్లపై నీటి­ని స్ప్రే చేస్తే.. రన్‌వే సమీపంలోకి పక్షులు రాకుండా నిలువరించగలమనీ.. తద్వారా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడదని తూర్పు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి.    – సాక్షి, విశాఖపట్నం

Election 2024

మరిన్ని వార్తలు