‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేప‌టి షెడ్యూల్‌ ఇలా.. | Sakshi
Sakshi News home page

‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేప‌టి షెడ్యూల్‌ ఇలా..

Published Sun, Apr 7 2024 7:16 PM

Memantha Siddham: Cm Jagan Bus Yatra April 8th Schedule - Sakshi

సాక్షి, ప్రకాశం జిల్లా: మేమంతా సిద్ధం 11వ రోజు సోమవారం (ఏప్రిల్ 8) షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఆదివారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 9 గంటలకు వెంకటా చలంపల్లి రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు.

ఉదయం 9:30 గంటలకి వెంకటాచలంపల్లి దగ్గర సామజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా  వినుకొండ అడ్డరోడ్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చీకటిగల పాలెం మీదుగా వినుకొండ 3 గంటలకు చేరుకుని రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటారు. తరువాత కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెం  రాత్రి బసకు చేరుకుంటారు.

ఇదీ చదవండి: చంద్రబాబు దారి అడ్డదారి: సీఎం జగన్‌

Advertisement
Advertisement