సాక్షి, విశాఖపట్నం: అనుమతి లేకుండా పవన్ కల్యాణ్ ర్యాలీ చేశారని వైజాగ్ సీపీ శ్రీకాంత్ అన్నారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెప్పినా పవన్ వినలేదన్నారు. పవన్పై దాడి జరుగుతుందని సోషల్ మీడియాలో పార్టీ కార్యకర్తలు చేసిన తప్పుడు ప్రచారంతో జనసేన కార్యకర్తలు భారీగా వచ్చారు. ఎయిర్పోర్ట్ వద్ద పథకం ప్రకారమే దాడి జరిగిందని సీపీ తెలిపారు. దాడి ఘటనలో 9 మందిని అరెస్ట్ చేశామని, 100 మందిపై కేసు నమోదు చేశామని సీపీ వెల్లడించారు.
చదవండి: అంతా పక్కా స్క్రిప్ట్.. అసలు కారణం ఇదన్న మాట..