Women :  ఆడబిడ్డల ఆంధ్రా!

5 Sep, 2023 04:48 IST|Sakshi

2014–15లో ప్రతి వెయ్యి మంది బాలురకు 921 మంది బాలికలు 

2022–23లో ప్రతి వెయ్యి మంది బాలురకు 945 మంది బాలికలు 

దేశానికి మించి ఏపీలో బాలికల నిష్పత్తి పెరుగుదల   

కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడి

సాక్షి, అమరావతి: దేశంలో, రాష్ట్రంలో జననాల్లో బాలి­కల సంఖ్య పెరు­గుతోంది. 2014–15 ఆర్థిక సం­వత్సరంతో పోలిస్తే.. దేశంలో ప్రతి వెయ్యి మంది బాలురకు 2022–23లో బాలికల నిష్పత్తి 15కు పెరగ్గా,  రాష్ట్రంలో 24కు పెరిగింది. దేశం మొత్తంతోపాటు చాలా రాష్ట్రాల్లో గతంలో కన్నా జననాల్లో బాలికల నిష్పత్తి పెరుగుతోందని, ఇది శుభపరిణామ­మని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

అయితే బిహార్‌తో పాటు మిజోరాం, నాగా­లాండ్‌లలో గతం కన్నా బాలికల నిష్పత్తి తగ్గ­డం ఆందో­ళన కలిగిస్తోందని తెలిపింది. బేటీ బచావో బేటీ పఢావో పథకం ద్వారా బాలికలు, మహిళా సాధికారతకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి ప్రయత్నా­లు చేస్తున్న­ట్టు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకం కింద జనన సమయంలో లింగ నిర్ధారణను గుర్తించే చర్యలను ప్రభుత్వం నిలు­­పుదల చేసి­ందని, ఆడపిల్లల జననాల పట్ల అవగా­హన పెంచేందుకు చర్యలు చేపట్టిం­దని తెలిపింది. 

ఆడపిల్లల అభివృద్ధికి ప్రోత్సాహం
ఆడపిల్లల విద్య, పెరుగుదల, అభివృద్ధి, హక్కులకు మద్దతుగా సాను­కూల చర్య­లను ప్రోత్సహించడానికి అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు చేస్తున్న­ట్టు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వెల్ల­డించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభు­త్వాలు, కేంద్ర పాలిత ప్రాం­తాలకు తగిన మార్గదర్శ­­కాలతో కూడిన కార్యా­చరణ క్యాలె­ండర్‌ జారీ అయి­నట్లు తెలిపింది. దానిని జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొంది. లింగ నిష్పత్తి తగ్గకుండా పటిష్ట చర్యలు తీసుకోవా­లని కేంద్ర ఆరోగ్య, కుటు­ంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వా­లకు  లేఖలు రాసినట్టు తె­లి­­పింది.  
 

మరిన్ని వార్తలు