-->

యాక్సిస్‌ క్రిసిల్‌ డెట్‌ ఇండెక్స్‌ ఫండ్‌

11 Mar, 2024 05:03 IST|Sakshi

యాక్సిస్‌ మ్యుచువల్‌ ఫండ్‌ కొత్తగా యాక్సిస్‌ క్రిసిల్‌ ఐబీఎక్స్‌ ఎస్‌డీఎల్‌ జూన్‌ 2034 డెట్‌ ఇండెక్స్‌ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇందులో కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు. మార్చి 12తో ఈ ఎన్‌ఎఫ్‌వో ముగుస్తుంది. ఈ ఆఫర్‌ ద్వారా సమీకరించిన నిధులను నిర్దేశిత ఇండెక్స్‌ సెక్యూరిటీల్లో మాత్రమే ఇన్వెస్ట్‌ చేస్తారు.

ప్రస్తుత ఈల్డ్‌ కర్వ్‌ .. మధ్య, దీర్ఘకాలిక పెట్టుబడులపై మెరుగైన రాబడులు అందుకునేందుకు అనువుగా ఉందని సంస్థ తెలిపింది. ఫిక్సిడ్‌ ఇన్‌కమ్‌ పోర్ట్‌ఫోలియోను పటిష్టపర్చుకోవాలని భావిస్తున్న ఇన్వెస్టర్లకు ఇది అనుకూలమైన ఫండ్‌ కాగలదని తెలిపింది.

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers