సత్యం కుంభకోణం.. ఇద్దరు సీఏల సభ్యత్వం రద్దు

28 Dec, 2023 09:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సత్యం కుంభకోణంతో సంబంధం ఉన్న ఇద్దరు చార్టెడ్‌ అకౌంటెంట్ల సభ్యత్వాన్ని ద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) రద్దు చేసింది. హైదరాబాద్‌కు చెందిన పులవర్తి శివప్రసాద్, సీహెచ్‌ రవీంద్రనాథ్‌లు ఐసీఏఐ నిబంధనలు మీరి వృత్తిపరమైన అవకతవకలకు పాల్పడ్డారని వారి సభ్యత్వం రద్దుతోపాటు చెరో రూ.5లక్షల జరిమానా విధిస్తూ క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసింది.

దీనిపై వారిద్దరూ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌కు వెళ్లగా కమిటీ సిఫార్సును సమర్థించింది. దీంతో వారిద్దరూ రూ.5లక్షలు జరిమానా ఐసీఏఐకి చెల్లించి ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఢిల్లీ కోర్టు వారిద్దరి పిటిషన్లు కొట్టివేయడంతో ఐసీఏఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

పులవర్తి శివప్రసాద్‌ (సభ్యతం–204076) , సీహెచ్‌ రవీంద్రనాధ్‌ (సభ్యత్వం–204494)ల పేరు సభ్యుల రిజిస్టర్‌ నుంచి తొలగిస్తున్నామని, ఇది డిసెంబరు 27, 2023 నుంచి అమలులోకి వస్తుందని ఐసీఏఐ బుధవారం పేర్కొంది. ఈ మేరకు సంస్థ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
 

>
మరిన్ని వార్తలు