సాక్షి మనీ మంత్ర: లాభాల్లో సాగుతున్న దేశీయ సూచీలు

1 Dec, 2023 09:36 IST|Sakshi

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతోనే ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 282.06 పాయింట్ల లాభంతో 67267.58 వద్ద, నిఫ్టీ 83.30 పాయింట్ల లాభంతో 20219.20 వద్ద కొనసాగవుతున్నాయి. ఈ రోజు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కూడా ఈ రోజు లాభాల్లో ముందుకెళ్తున్నాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా అపోలో హాస్పిటల్, నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), లార్సెన్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ వంటి సంస్థలు చేరగా.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, రిలయన్స్ కంపెనీలు నష్టాల బాట పట్టాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

మరిన్ని వార్తలు