మీడియా ట్రేడ్ మార్క్ వివాదం: ఆర్‌టీవీకి భారీ ఊరట

1 Sep, 2023 12:51 IST|Sakshi

ముంబై హైకోర్టులో రిపబ్లిక్ వర్సెస్ R టీవీ

R టీవీకి అనుకూలంగా ఉత్తర్వులు

రిపబ్లిక్ వాదనను తోసి పుచ్చిన హైకోర్టు

R ట్రేడ్ మార్క్ నాదేనన్న రిపబ్లిక్ వాదనను తోసిపుచ్చిన కోర్టు

మీడియాలో ట్రేడ్ మార్క్ వివాదంలో తెలుగు న్యూస్‌ ఛానల్‌ ఆర్‌టీవీకి ఊరట లభించింది. రిపబ్లిక్ టీవీ లోగో, 'R'ను వినియోగించి  RTV న్యూస్‌ ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనకు పాల్పడిందన్న ఆరోపణలను కోర్టు బాంబే హైకోర్టు శుక్రవారం తోసి పుచ్చింది. ఈ వ్యాజ్యాన్ని విచారించే వరకు ఆర్‌టీవీ న్యూస్ లోగో వినియోగంపై అత్యవసర స్టే విధించాలని కోరుతూ రిపబ్లిక్ టీవీ వేసిన మధ్యంతర దరఖాస్తును జస్టిస్ మనీష్ పితలే తోసిపుచ్చారు.

జాతీయ ఛానెల్ రిపబ్లిక్ టీవీ, రవిప్రకాష్‌ నేతృత్వంలోని R TV న్యూస్‌పై ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనకు రూ.100 కోట్ల నష్ట పరిహారం కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. RTV తన ట్రేడ్‌మార్క్‌ను కాపీ కొట్టి, మోసపూరితంగా   వ్యవరించిందని  ఆరోపించింది. ఈ ఉల్లంఘనకు గాను ఆర్‌టీవీపై శాశ్వత నిషేధాన్ని విధించాలని కోరుతూ రిపబ్లిక్ TV మాతృ సంస్థ ARG Outlier మార్చి 2023లో దావా వేసింది. తాజాగా ఈ విషయంలో రిపబ్లిక్ టీవీకి  భారీ షాక్‌ తగిలింది.

మరిన్ని వార్తలు