సాక్షి, పటాన్ చెరు: చికిత్స పొందుతూ 18 నెలల చిన్నారి మృతిచెందిన ఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. జోగిపేటకి చెందిన బాబు కొద్ది రోజుల క్రితం బతుకుదెరువు కోసం ఇస్నాపూర్కు భార్య, కూతురుతో కలిసి వచ్చాడు. సిరిపురం వెంచర్లో గుడిసెలో ఉంటూ ట్రాక్టర్ డ్రైవర్గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 18న (గురువారం) మధ్యాహ్నం బాబు వెంచర్లో ట్రాక్టర్ నడుపుతుండగా తండ్రిని చూసిన చిన్నారి అంజలి ట్రాక్టర్ దగ్గరికి పరుగులు తీసి కింద పడిపోయింది.
దీంతో చిన్నారికి తలవెనుకాల గాయమైంది. చిన్నారిని చికిత్స కోసం పటాన్చెరు ప్రభుత్వాస్పపత్రికి తరలించి, మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీస్లు చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చదవండి:
భర్త రెండో పెళ్లి.. భార్యపై వేధింపులు.. ఆ తర్వాత
ఢిల్లీ యువతి ఫిర్యాదుతో బట్టబయలైన వ్యభిచార గుట్టు