Hyderabad: కృష్ణానగర్‌లో దారుణం.. బౌలింగ్‌ సరిగా వేయలేదని..

2 Mar, 2022 16:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. స్థానిక సాయికృప పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థుల మధ్య వివాదం జరిగి ఘర్షణ పడ్డారు. తరగతి గదిలో క్రికెట్‌ ఆడుతూ బౌలింగ్‌ సరిగా వేయడం లేదంటూ నలుగురు విద్యార్థులు ఘర్షణ పడి ఒకిరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో మన్సూర్‌ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చదవండి: (గుడ్‌న్యూస్‌: సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం)

మరిన్ని వార్తలు