విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో గురువారం నిర్వహించిన బయోలాజికల్ సైన్స్ పరీక్షలో 15 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ ఎండీ అబ్దుల్హై తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 12,032 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. 12,017 మంది హాజరయ్యారు. ప్రైవేట్ అభ్యర్థులు 210మందికిగాను 196 మంది పరీక్ష రాసినట్లు ఆయన తెలిపారు. డీఈఓ అబ్దుల్హై, ఏసీజీ చలపతిరావు కలిసి 5 పరీక్ష కేంద్రాలను, ఫ్లయింగ్ స్కా్వ్డ్లు 14 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
వరంగల్ జిల్లాలో..
కాళోజీ సెంటర్ : వరంగల్ జిల్లాలో గురువారం నిర్వహించిన టెన్త్ బయాలజికల్ సైన్స్ పరీక్షకు 16 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ వాసంతి తెలిపారు. మొత్తం 9,523 మంది విద్యార్థులకు 9,507 మంది హాజరైనట్లు ఆమె పేర్కొన్నారు.