అమెరికాలో క‌రోనా విల‌య‌తాండ‌వం

30 Jul, 2020 22:07 IST|Sakshi

న్యూయార్క్ : అమెరికాలో కరోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది.  రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య వేలల్లో పెరుగుతుండగా మరణాల సంఖ్య‌ అంతకంతకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు  దేశవ్యాప్తంగా 4.4 మిలియన్ల మంది వైరస్‌ బారినపడగా మృత్యుల సంఖ్య 1.5 లక్షలు దాటిందని ప్రఖ్యాత జాన్‌ హప్కిన్‌ యూనివర్సిటీ తన నివేదికలో వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 16 మిలియన్ల మంది కరోనా బారినపడగా మ‌ర‌ణాల సంఖ్య‌ 6 లక్షల 60 వేలుగా ఉంది. అమెరికాలో తొలి కరోనా మరణం ఫిబ్రవరి 29న సంభవించగా కేవలం 54 రోజుల్లో (ఏప్రిల్‌23) వరకు మృత్యుల సంఖ్య 50 వేలకు చేరింది. మరో 34 రోజులు (మే23) వరకు లక్షకు పెరిగింది. ఆ తరువాతి 63 రోజుల్లో 1.5 లక్షల మార్కును దాటిందని సీఎన్‌ఎస్‌ తన నివేదికలో పేర్కొంది. 

మరిన్ని వార్తలు