అమెరికాలో కాల్పులు.. ఒకరి దుర్మరణం

16 Feb, 2024 05:40 IST|Sakshi

22 మందికి గాయాలు

కాన్సాస్‌ సిటీ: అమెరికాలోని మిస్సౌరీ రాష్ట్రం కాన్సాస్‌ సిటీలో కాల్పులు చోటు చేసుకు న్నాయి.. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 8 మంది చిన్నారులు సహా మరో 22 మంది గాయాలపాలయ్యారు. బుధవారం సూపర్‌ బౌల్‌ చాంపియన్‌ షిప్‌ గెలుచుకున్న జట్టు విజయోత్సవాలు జరుపుతున్న వేళ గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు దిగారు.

దీంతో జనమంతా భయంతో కేకలు వేస్తూ తలోదిక్కుకు పరుగులు తీయడంతో అంతా గందరగోళంగా మారింది. కాల్పులకు కారకులుగా అనుమానిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు కారణాలు తెలియాల్సి ఉంది.

మరో ఘటనలో..
రాజధాని వాషింగ్టన్‌లో బుధవారం ఉదయం పోలీసు అధికారులు జంతు హింస కేసులో జూలియస్‌ జేమ్స్‌ అనే వ్యక్తికి వారెంట్లు ఇచ్చేందుకు అతడి ఇంటికి వెళ్లారు. నిందితుడు పారిపోయేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అతడు ఇంట్లో ఉండే  పోలీసులపైకి కాల్పులకు దిగాడు. ఘటనలో ముగ్గురు అధికారులకు గాయాలయ్యాయి. కొన్ని గంటల అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.  

whatsapp channel

మరిన్ని వార్తలు