ఖమ్మంమయూరిసెంటర్: రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలతో వరి, మొక్కజొన్న, మిర్చి, ఉద్యానవన పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. చేతికొచ్చిన మొక్కజొన్న పంట నష్టపోవడమే కాక, మిర్చి రంగు మారడంతో ధర పడిపోయే ప్రమాదముందని తెలిపారు. అధికారులు వెంటనే నివేదికలు రూపొందించి రైతులకు పరిహారం చెల్లించాలని, పంటల బీమా పథకాన్ని అమలు చేయాల ని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షు డు బాగం హేమంతరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నా గేశ్వరరావు వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు.