ప్రజావాణి అర్జీలను సత్వరం పరిష్కరించాలి

7 Mar, 2023 04:02 IST|Sakshi
అర్జీలను స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్‌ రమేశ్‌
అదనపు కలెక్టర్‌ రమేశ్‌

మెదక్‌ కలెక్టరేట్‌: ప్రజావాణి అర్జీలను అధికారులు సత్వరం పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ రమేశ్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నామన్నారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. అనంతరం వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని అధికారులకు సూచించారు. ప్రజావాణికి 60 అర్జీలు రాగా 10 డబుల్‌ బెడ్రూం ఇళ్లు, ఆసరా పింఛన్లకు 10, ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల కోసం ఐదు దరఖాస్తులు వచ్చాయి. మిగితా 35 భూ సమస్యలు, ధరణి, సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌, ఇతర శాఖలకు సంబంధించివి ఉన్నాయి.

మరిన్ని వార్తలు