బంజారాహిల్స్: నాలుగు రోజుల నుంచి హోరాహోరీగా సాగిన 13వ హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సోమవారం ఘనంగా ముగిసింది. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన పోటీల్లో నంద్యాల నర్సింహారెడ్డి, నీల్కాంత్ జోడి మెన్స్ డబుల్ విభాగంలో ఛాంపియన్లుగా నిలిచారు.
● పురుషుల 50 ప్లస్ డబుల్స్లో నర్సింహారెడ్డి, నీల్కాంత్ టైటిల్ పోరులో కేవీఎన్ మూర్తి, సురేష్పై విజయం సాధించారు.
● మెన్స్ 30 ప్లస్ డబుల్స్లో అనిరుద్, సిద్దార్థ్జోడి గెలుపొందారు.
● 40 ప్లస్ డబుల్స్లో వినోద్, కిరణ్, 60 ప్లస్ డబుల్స్లో మెహర్ ప్రకాశ్, పాల్ మనోహర్లు, 70 ప్లస్ డబుల్స్లో మదన్ మోహన్, రాంబాబు విజేతలుగా నిలిచారు.
● సింగిల్స్ విభాగంలో రాంమోహన్రావు(70 ప్లస్) మెహర్ ప్రకాశ్(60 ప్లస్), నీల్ కాంత్(50 ప్లస్), వినోద్ శ్రీధర్(40 ప్లస్), అంకిత్ భార్గవ(30 ప్లస్) టైటిల్ గెలుచుకున్నారు.
● ఏకపక్షంగా సాగిన మహిళల ఓపెన్ సింగిల్స్లో సౌమ్యానాయుడిపై జానకి గెలుపొందగా మహిళల డబుల్స్లో ఉన్నతి, జానకి జోడి విజయం సాధించారు. జేహెచ్ఐసీ ఉపాధ్యక్షురాలు ఆదాల బిందుతో కలిసి కోల రాజ్యలక్ష్మి కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.