Soumya Janu: నటి సౌమ్య జాను వివాదం.. హైకోర్టు కీలక ఆదేశాలు!

6 Mar, 2024 14:22 IST|Sakshi

టాలీవుడ్ నటికి ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌తో వివాదం మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇప్పటికే ఈ సంఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సౌమ్య జాను రాంగ్‌ రూట్‌లో రావడంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ హౌంగార్డ్‌ ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

తాజాగా ఈ కేసుపై నటి సౌమ్య జాను హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోకుండా స్టే విధించాలని కోరుతూ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం సౌమ్యకు సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. అంతే కాకుండా మార్చి 11 లోపు పోలీసుల ఎదుట హాజరు కావాలని సౌమ్యకు హైకోర్ట్ సూచించింది. 

‍అసలేం జరిగిందంటే.. 

బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హోంగార్డుపై దాడికి పాల్పడిందని సినీనటి సౌమ్యజానుపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతనెల 24న బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లోని అగ్రసేన్‌ జంక్షన్‌లో జాగ్వార్‌ కారులో రాంగ్‌రూట్‌లో వచ్చిన సౌమ్యను విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ హోంగార్డుపై  అడ్డుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. 
 
 

whatsapp channel

మరిన్ని వార్తలు