Janhvi Kapoor: మాజీ ప్రియుడితో సందడి చేసిన జాన్వీ.. సోషల్ మీడియాలో వైరల్

18 Dec, 2022 15:18 IST|Sakshi

బాలీవుడ్ అందాల భామ, దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది అమ్మడు. సోషల్ మీడియాలో ఫోటోలతో హల్‌చల్ చేస్తూ ఉంటోంది. ఇటీవలే ముంబైలో జరిగిన ఓ షోలో బాయ్‌ఫ్రెండ్‌తో తళుక్కున మెరిసింది. తాజాగా తన మాజీ లవర్‌తో కలిసి దిల్లీలో జరిగిన ఫ్యాషన్‌ షోలో సందడి చేసింది. దీనికి సంబంధంచిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో అభిమానులు డేటింగ్ చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. 

శనివారం దిల్లీలో జరిగిన ఫ్యాషన్ షోలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన మాజీ ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి కనిపించింది. శిఖర్‌తో ఉన్న పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో మళ్లీ  డేటింగ్‌లో ఉన్నారా అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల జాన్వీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్ చేసినప్పుడు.. శిఖర్ 'వావ్ వావ్' అంటూ రెడ్ హార్ట్ ఎమోజీలు జతచేశారు. ఇటీవలే ఇద్దరూ కలిసి మాల్దీవుల్లో విహారయాత్రకు వెళ్లిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. 

శిఖర్ ఎవరంటే.. శిఖర్ పహారియా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. జాన్వీ బాలీవుడ్‌లో అరంగేట్రం చేయడానికి ముందు శిఖర్‌తో డేటింగ్ చేసినట్లు సమాచారం. శిఖర్ సోదరుడు వీర్ పహారియా.. జాన్వీ ప్రాణ స్నేహితురాలు సారా అలీ ఖాన్ మాజీ ప్రియుడు.

జాన్వీ తర్వాత వరుణ్ ధావన్‌తో కలిసి బవాల్‌ చిత్రంలో కనిపించనుంది. ఇటీవలే పోలాండ్‌లో సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది ముద్దుగుమ్మ. ఈ సినిమా  వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఆమె తన తదుపరి చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మహి కోసం శిక్షణా కార్యక్రమాలను కూడా ప్రారంభించింది. ఈ మూవీలో రాజ్‌కుమార్ రావు కీలక పాత్రలో నటించారు. క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. శరణ్ శర్మ దర్శకత్వం వహించిన దీనికి కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. 

A post shared by Instant Bollywood (@instantbollywood)

మరిన్ని వార్తలు