OTT: గ్రాండ్‌గా ‘కన్నిరాశి’ వెబ్‌సిరీస్‌ లాంచ్‌, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

18 May, 2022 11:48 IST|Sakshi

బ్లాక్‌షీప్‌ సంస్థ కన్నిరాశి పేరుతో మరో భారీ వెబ్‌సిరీస్‌కి శ్రీకారం చుట్టింది. ఇంతకు ముందు ఈ సంస్థ నిర్మించిన ఆహా కల్యాణం వెబ్‌సిరీస్‌ బీఎస్‌ వాల్యూ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో (100 మిలియన్ల మార్కు దాటి) విశేష ప్రేక్షకుల ఆదరణతో తమిళంలో తొలి నంబర్‌ వన్‌ వెబ్‌ సిరీస్‌గా నిలిచింది.

తాజాగా కన్నిరాశి పేరుతో రూపొందిస్తున్న వెబ్‌సిరీస్‌ను సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. దీనికి అన్బుదాసన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు సేట్టై షరీఫ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో అభిషేక్‌ కుమార్, శ్వేత, షామ్నీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌ను ఆగస్టు 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ చేయనున్నారు.

చదవండి 👇

బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలే, అసలైన పోటీ ఆ ఇద్దరి మధ్యే!

నన్ను బతికించారు.. నా బతుకుదెరువుని కూడా బతికించండి

మరిన్ని వార్తలు