మా కష్టాన్ని మర్చిపోయే విజయం లభించింది

5 Nov, 2023 00:47 IST|Sakshi
వంశీ, ‘బన్నీ’ వాసు, రాజేశ్, కామాక్షి, అనిల్, గౌరీకృష్ణ

వంశీ నందిపాటి

‘సత్యం’ రాజేశ్, కామాక్షీ భాస్కర్ల ప్రధాన తారాగణంగా రూపోందిన హారర్‌ అండ్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ ‘మా ఊరి పోలిమేర 2’. అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వంలో గౌరీకృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని పంపిణీదారుడు వంశీ నందిపాటి ఈ నెల 3న రిలీజ్‌ చేశారు.శనివారం జరిగిన ఈ సినిమా సక్సెస్‌ మీట్‌కు అతిథిగా హాజరైన నిర్మాత ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం వంశీ, గౌరీకృష్ణ చాలా కష్టపడ్డారు.

ఈ సినిమా ఘనవిజయం సాధించడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘మా ఊరి పోలిమేర 1’ ఓటీటీలో విడుదలైనా, పార్ట్‌ 2 థియేటర్స్‌లో రిలీజై ఇంతటి ఘనవిజయం సాధించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా రిలీజ్‌ కోసం గౌరీకృష్ణ ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. మమ్మల్నిప్రోత్సహించిన ‘బన్నీ’ వాసు, వంశీగార్లకు ధన్యవాదాలు’’ అన్నారు ‘సత్యం’ రాజేశ్, అనిల్‌ విశ్వనాథ్‌. ‘‘ఈ సినిమా విషయంలో మూడు రోజుల నుంచి మేం చాలా కష్టపడ్డాం. ఆ  కష్టాన్ని మర్చిపోయేలా మంచి విజయం దక్కడం హ్యాపీగా ఉంది’’ అన్నారు వంశీ నందిపాటి. ‘‘కలెక్షన్స్‌ రిపోర్ట్స్‌ చూసి హ్యాపీగా ఉన్నాం’’ అన్నారు కామాక్షి.

మరిన్ని వార్తలు