Maa Elections 2021: నరేష్‌ వల్లే 'మా' శ్రేయస్సు కుంటుపడుతూ వచ్చింది..

12 Oct, 2021 19:28 IST|Sakshi

MAA Elections 2021: Actor Uttej About Naresh: భిన్నాభిప్రాయాలకు అవకాశం లేకుండా తాము తప్పుకుంటున్నామని నటుడు ఉత్తేజ్‌ అన్నారు. పోలింగ్‌ రోజున నరేష్‌ యుద్ధవాతావరణం సృష్టించారని, తనని తన కుటుంబ సభ్యులను బండబూతులు తిట్టారని పేర్కొన్నారు. 'నా  భార్య పద్మ చనిపోతే చిరంజీవి, జీవితా రాజశేఖర్‌, ప్రకాశ్‌రాజ్‌ సహా పలువురు హస్పిటల్‌ వద్దనే ఉండి తన ఓదార్చారు. కానీ నరేష్‌ నుంచి మాత్రం​ ఒక్క ఫోన్‌ కాల్‌ కూడా రాలేదు.

నా 25 ఏళ్ల కెరీర్‌లో బెనర్జీ అన్న ఏడవటం చూడలేదు. నరేష్ వల్లే "మా" శ్రేయస్సు కుంటుపడుతూ వచ్చింది. విష్ణు బాగా పనిచేయాలని ఆశిస్తున్నాం' అని ఉత్తేజ్‌ పేర్కొన్నారు. చదవండి: మోహన్‌ బాబు కించపరిచే బూతులు తిట్టారు: తనీష్‌

మరిన్ని వార్తలు