Manchu Vishnu: ఈసీ మెంబర్లను ప్రకటించనున్న మంచు విష్ణు

11 Oct, 2021 16:16 IST|Sakshi

ఆత్మీయంగా కలుసుకున్న ఇరు వర్గాల సభ్యులు

►జూబ్లీ పబ్లిక్ స్కూల్కి చేరుకున్న శివ బాలాజీ

► మరికాసేపట్లో 'మా' ఎన్నికల్లో గెలుపొందిన ఈసీ మెంబర్లు, ఆఫీస్ బేరర్లు ఒక వైస్ ప్రెసిడెంట్ ఒక జాయింట్ సెక్రటరీ ఫలితంపై ప్రకటన 

►నిన్న పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కేవలం ప్రెసిడెంట్ స్థానంవి మాత్రమే కౌంట్ చేశారు

మంచు విష్ణు-‍ ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్స్‌కు చెందిన మెంబర్స్‌ ఆత్మీయంగా కలుసుకున్నారు. 

మంచు విష్ణు
శ్రీకాంత్
ఖయ్యుం
సీరియల్ నటుడు ప్రభాకర్
సుడిగాలి సుధీర్
మాదాల రవి
పసుమూర్తి శ్రీనివాసులు
అరునాద బాబులు సరదాగా ముచ్చటించారు. 

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌పై 107 ఓట్ల తేడాతో మంచు విష్ణు విజయం సాధించారు. ఆయన ప్యానల్‌ నుంచి గెలిచిన ఈసీ మెంబర్లను కాసేపట్లో ఆయన ప్రకటించనున్నారు. ఇప్పటికే మంచు విష్ణు జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్‌కి చేరుకున్నారు. ఆయనతో పాటు ఆయన ప్యానల్‌ నుంచి గెలిచిన ఈసీ మెంబర్లు సైతం ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు