మామన్నన్ మూవీతో హిట్ అందుకు డైరెక్టర్ మారి సెల్వరాజ్. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వాజై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కలైయరాసన్, నిఖిలా విమల్, ప్రియాంక, దివ్య, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం థియేటర్లలో కాకుండా ఓటీటీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. మూడు సూపర్ హిట్ చిత్రాల తర్వాత మారి సెల్వరాజ్ తెరకెక్కించిన నాలుగో చిత్రం వాజై ఓటీటీలో రిలీజ్ చేయడంపై ఫ్యాన్స్కు ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
మామన్నన్ కంటే ముందే వచ్చిన పెరియారుమ్ పెరుమాల్, కర్ణన్ చిత్రాలు సక్సెస్ అయ్యాయి. సమాజంలో అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న వివక్షలను తనదైన శైలిలో తెరకెక్కిస్తూ సక్సెస్ అందుకున్నారు మారి సెల్వరాజ్. దీంతో వాజై మూవీని కూడా థియేటర్లలోనే రిలీజ్ చేస్తారని కోలీవుడ్ ఫ్యాన్స్ భావించారు. అదే తరహాలోనే వాజై చిత్రాన్ని కూడా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
అసలు కారణమిదేనా?
అయితే ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్, నవ్వి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. అందువల్లే ఈ మూవీని థియేటర్లలో కాకుండా డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్ను కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తామని ఇటీవలే డిస్నీ ప్లస్ హాట్స్టార్ ప్రకటించింది. కాగా.. ఈ సినిమాకు దసరా ఫేమ్ సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
நீளும் நீச்சலில் என் நா கேட்கும் ஒரு சொட்டுத் தேன் .
—வாழை 🌴 This year belongs to #VaazhaiTeam Vaazhai welcomes 2024 with warm hands!!
Hitting theatres soon!! 🌴@disneyplusHSTam @navvistudios @mari_selvaraj @Music_Santhosh @thenieswar @KalaiActor @Nikhilavimal1… pic.twitter.com/CKrQNimnt7
— Mari Selvaraj (@mari_selvaraj) January 1, 2024