వెంకటేశ్‌కి జోడీగా...

4 Mar, 2024 01:30 IST|Sakshi

హీరోయిన్‌గా మీనాక్షీ చౌదరి ప్రస్తుతం ఫుల్‌ఫామ్‌లో ఉన్నారు. తమిళ హీరో విజయ్‌ ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’, వరుణ్‌ తేజ్‌ ‘మట్కా’, దుల్కర్‌ సల్మాన్‌ ‘లక్కీ భాస్కర్‌’, విశ్వక్‌ సేన్‌ పదో చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు ఈ యంగ్‌ బ్యూటీ. కాగా మీనాక్షీకి హీరోయిన్‌గా మరో సూపర్‌ చాన్స్‌ వచ్చిందని టాక్‌. ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్‌–దర్శకుడు అనిల్‌ రావిపూడిల కాంబినేషన్‌లో ఓ విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ తెరకెక్కనుందనే టాక్‌ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను ‘దిల్‌’ రాజు నిర్మించనున్నారని సమాచారం. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తొలుత త్రిష పేరు వినిపించింది. తాజాగా మీనాక్షీ చౌదరి పేరు తెరపైకి వచ్చింది. వెంకీ వంటి స్టార్‌ హీరో సినిమా కాబట్టి మీనాక్షీ కూడా ఆల్మోస్ట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసినట్టేనని అంటున్నారు ఫిల్మ్‌నగర్‌ వాసులు. ఇక ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారని, ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్‌ పరిశీలిస్తోందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఇంకా.. కథ రీత్యా ఇందులో ఓ గెస్ట్‌ రోల్‌ ఉందని, ఈ పాత్రలో రవితేజ లేదా బాలకృష్ణ కనిపిస్తారని భోగట్టా.

whatsapp channel

మరిన్ని వార్తలు