Kantara : చిక్కుల్లో 'కాంతార' టీం.. లీగల్‌ నోటీసులు! ఎందుకంటే..

25 Oct, 2022 12:03 IST|Sakshi

కన్నడ హీరో రిషబ్‌ శెట్టి నటించిన తాజా చిత్రం కాంతార. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డుని సృష్టిస్తోంది.హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరాంగదుర్‌ నిర్మించిన కాంతార మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబడుతుంది. దేశవ్యాప్తంగా ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది.

కథ పరంగానే కాదు పాటలకు కూడా మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా ‘వరాహరూపం.. దైవ వరిష్ఠం..’ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ పాట బాణీని కాపీ కొట్టారంటూ ‘తైక్కుడం బ్రిడ్జ్’ అనే మ్యూజిక్‌ బ్యాండ్‌ ఆరోపణలు చేస్తుంది. అంతేకాకుండా తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా నెటిజన్లను విజ్ఞప్తి చేసింది.

కాంతారలోని వరాహ రూపం పాట మా సాంగ్‌ నవసరను కాపీ కొట్టారు. ఈ కాపీకి కారణమైన వాళ్లపై మేం చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నాం అంటూ ఇన్‌స్టాలో పోస్టును షేర్‌ చేశారు. దీనికి ర్మాత విజయ్ కిరగందూర్, సినిమా హీరో & దర్శకుడు రిషబ్ శెట్టికి కూడా ట్యాగ్ చేశారు. అయితే ఈ ఆరోపణలపై కాంతార టీం ఇంకా స్పందిచలేదు.

A post shared by Thaikkudam Bridge (@thaikkudambridge)

మరిన్ని వార్తలు