ఘనంగా నిహారిక-చైతన్య రిసెప్షన్

11 Dec, 2020 21:07 IST|Sakshi

చైతన్య జొన్నలగడ్డ, నిహారిక రిసెప్షన్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరుగుతుంది. ఈ నెల 9న రాజస్తాన్ ఉదయపూర్‌లోని ఉదయ్ విలాస్ లో చైతన్య,నిహారికల వివాహం జరిగింది. మెగా హీరోలంతా ఫ్యామిలీతో ఈ శుభకార్యానికి హాజరై సందడి చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ ఈ వేడుకలో పాల్గొన్నారు.  
(చదవండి : నా బంగారు తల్లి.. డాషింగ్‌ బావ: వరుణ్‌ తేజ్‌)

శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన రిసెప్షన్ వేడుకలో మెగా కుటుంబ సభ్యులతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని నూతన వధు వరులను ఆశీర్వదించారు. ఇండస్ట్రీ నుంచి పలువరు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. జేఆర్సీ కన్వెన్షన్‌ లోపలికి వెళ్లడానికి పాస్‌ వర్డ్‌ని క్రియేట్‌ చేశారు కుటుంబసభ్యులు. వేడుక కోసం జేఆర్సీ ప్రాంగణాన్ని గ్రాండ్‌గా డెకరేట్ చేశారు.  కరోనా‌ నిబంధనలకు అనుగుణంగా అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు