Pooja Hegde-Hrithik: అప్పుడు నా గుండె ముక్కలైపోయింది: పూజా హెగ్డే

3 May, 2022 12:22 IST|Sakshi

Pooja Hegde Reveals Her Heart Broken Moment With Hrithik Roshan: టాలీవుడ్ బుట్టబొమ్మగా పేరు తెచ్చుకుంది పూజా హెగ్డే. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇటీవలే మెగాస్టార్​ చిరంజీవి, మెగా పవర్​ స్టార్​ రామ్​ చరణ్​తో కలిసి నటించిన 'ఆచార్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో చెర్రీకి సరసన పూజా నటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంది పూజా హెగ్డే.

బాలీవుడ్​ గ్రీక్​ గాడ్ హృతిక్​ రోషన్ కెరీర్​లో సూపర్​ హిట్​గా నిలిచిన చిత్రాల్లో 'కోయీ మిల్​గయా' ఒకటి. ఈ సినిమా సమయంలో జరిగిన విషయాలను పూజా హెగ్డె చెప్పుకొచ్చింది. 'కోయీ ​మిల్​గయా సినిమా సమయంలో నాకు పన్నెండేళ్లు. నాకు హృతిక్​ రోషన్​ అంటే చాలా ఇష్టం. ఆయనతో ఫొటో దిగాలని ప్రీమియర్​ షోకు వెళ్లాను. కానీ ఫొటో కోసం ప్రయత్నిస్తుంటే హృతిక్​ స్టేజి దిగి వెళ్లిపోయారు. దీంతో ఒక్కసారిగా నా గుండె ముక్కలైపోయినట్లుగా అనిపించింది.' అని తెలిపింది. (చదవండి: పూజా హెగ్డేపై దిల్‌రాజు కామెంట్స్‌.. షాక్‌ అయిన ఆడియెన్స్‌)

అయితే సుమారు పదేళ్ల తర్వాత పూజా హెగ్డే, హృతిక్​ రోషన్​ హీరోహీరోయిన్లుగా 'మొహంజొదారో' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.  ఇదిలా ఉంటే ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్ డైరెక్టర్​ రోహిత్​ శెట్టి డైరెక్షన్​లో వస్తున్న సర్కస్​ చిత్రంలో నటిస్తోంది. ఇందులో రణ్​వీర్ సింగ్, జాక్వెలిన్​ ఫెర్నాండెస్​తోపాటు పూజా హెగ్డే కీలక పాత్రలో నటిస్తోంది. (చదవండి: ఆ స్టార్‌ హీరోను 'ఆంటీ' అంటానంటున్న పూజా హెగ్డే)

మరిన్ని వార్తలు