Ram Charan: మీ అతిథ్యానికి హృదయపూర్వక కృతజ్ఞతలు: రామ్ చరణ్‌

22 Dec, 2023 17:46 IST|Sakshi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా ‍అద్వానీ కనిపించనుంది. ఈ సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్‌ కాస్తా గ్యాప్ దొరకడంతో ఫ్యామిలీతో కలిసి ముంబై వెళ్లారు. నగరంలోని శ్రీమహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి తొలిసారి ఆలయానికి వెళ్లారు. ఈ ఏడాది జూన్‌ నెలలో ఈ జంటకు కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే.

(ఇది చదవండి: పెళ్లి పీటలెక్కనున్న సీనియర్ హీరోయిన్ కుమారుడు.. వధువు ఎవరంటే?)

అయితే ప్రస్తుతం ముంబై పర్యటనలో ఉన్న రామ్ చరణ్-ఉపాసన దంపతులు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండేను మర్యాదపూర్వకంగా కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను చెర్రీ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. మహారాష్ట్ర ప్రజల అతిథ్యం, అప్యాయతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించారు. 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

A post shared by Ram Charan (@alwaysramcharan)

>
మరిన్ని వార్తలు