మరోసారి ఉదారతను చాటుకున్న సోనూసూద్‌

26 Dec, 2020 01:13 IST|Sakshi

సాక్షి, సనత్‌నగర్‌ (హైదరాబాద్‌): ప్రముఖ సినీనటుడు సోనూసూద్‌ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఆయన స్ఫూర్తితో హైదరాబాద్‌లోని బేగంపేటలో ఓ యువకుడు నిర్వహిస్తున్న ‘లక్ష్మీ సోనూ సూద్‌ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌’ను శుక్రవారం సందర్శించారు. అనిల్‌ అనే యువకుడు కరోనా కష్టకాలంలో తన చైనీస్‌ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ను తొలగించి, పూర్తిగా హైదరాబాదీ స్టైల్‌లో ఫుడ్‌ కోర్టు నిర్వహిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సోనూ.. ఆ ఫుడ్‌ కోర్టును సందర్శించేందుకు రాగా అనిల్‌ ఘనస్వాగతం పలికాడు. ఈ సందర్భంగా సోనూ తానే స్వయంగా ఎగ్‌ ఫ్రైడ్‌రైస్‌ను తయారు చేసుకుని ఆరగించారు. చదవండి: (విగ్రహం ఏర్పాటుపై సోనూసూద్‌ కామెంట్‌)

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు