రాణీ కశ్యప్‌ కథేంటి?

4 Jun, 2021 01:21 IST|Sakshi

ఓ హత్య జరిగింది. కానీ ఈ మర్డర్‌ ఎలా? ఎందుకు జరిగింది? కథేంటి అనేది తాను నటించిన హిందీ చిత్రం ‘హసీన్‌ దిల్‌రుబా’లో చూడమని చెబుతున్నారు తాప్సీ. ఈ చిత్రానికి వినిల్‌ మ్యాథ్యూ దర్శకత్వం వహించారు. విక్రాంత్‌ మెస్సీ, హర్షవర్థన్‌ రాణే కీలక పాత్రలు పోషించారు. మర్డర్‌ మిస్టరీగా రూపొందిన ఈ చిత్రం జూలై 2 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. నిజానికి గత ఏడాది ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదరకపోవడంతో ఇప్పుడు ఓటీటీలో రిలీజ్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. ‘‘ఇందులో రాణీ కశ్యప్‌ పాత్రలో కొత్తగా కనిపిస్తాను. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకు ఇది భిన్నంగా ఉంటుంది’’ అన్నారు తాప్సీ. 

మరిన్ని వార్తలు