Virupaksha: బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ‘విరూపాక్ష’.. రెండో రోజు కలెక్షన్స్‌ ఎంతంటే..

23 Apr, 2023 12:27 IST|Sakshi

చాలా కాలం తర్వాత సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ్ ఖాతాలో మరో హిట్‌ పడింది. యాక్సిడెంట్‌ తర్వాత ఆయన నటించిన ‘విరూపాక్ష’ మూవీ ఈ నెల 21న విడుదలై హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. తొలి రోజు తెలుగు రాష్ట్రాలలో దాదాపు రూ.5 కోట్ల షేర్‌ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు అంతకంటే ఎక్కువగా రూ5.80 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.65 కోట్ల షేర్‌, రూ. 24.60 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ని దక్కించుకుంది.

ఈ మూవీకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ. 22 కోట్లకు జరిగింది. బ్రేక్‌ ఈవెన్‌ సాధించాలంటే రూ. 23 కోట్లను వసూలు చేయాలి. రెండు రోజుల్లో రూ.13.65 కోట్లు సాధించింది. అంటే రూ. 9.35 కోట్ల 5 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టాలి. మూవీకి వచ్చిన టాక్‌ని బట్టి చూస్తే.. మరో రెండు రోజుల్లో ఈజీగా బ్రేక్‌ ఈవెన్‌ సాంధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  మొత్తానికి సాయి తేజ్‌ రీఎంట్రీతోనే బిగ్‌ కొట్టాడని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

(చదవండి: 20 ఏళ్ల తర్వాత చిరంజీవితో శ్రియ.. ఏకంగా రూ. కోటి డిమాండ్‌!)

ఈ చిత్రానికి క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ స్క్రీన్‌ప్లే అందించగా.. ఆయన శిష్యుడు కార్తిక్‌ దండు దర్శకత్వం వహించారు. కాంతారా ఫేమ్‌  అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందించారు. సాయితేజ్‌కి జోడిగా సంయుక్త మీనన్‌ నటించగా.. రాజీవ్‌ కనకాల, సునీల్‌, సాయిచంద్‌, బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రలు పోషించారు. 

మరిన్ని వార్తలు