Vishal-Enemy Movie: ఓటీటీలో ఎనిమి, ఎప్పుడు? ఎక్కడంటే?

11 Feb, 2022 12:08 IST|Sakshi

యాక్షన్ హీరో విశాల్,  ఆర్య కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఎనిమి.  మమతా మోహన్‌దాస్‌, మృణాళిని కథానాయికలు. నోటా డైరెక్టర్‌ ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహించగా మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్ వినోద్ కుమార్ నిర్మించాడు. సింగపూర్‌లో లిటిల్‌ ఇండియా అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ జరిగే కథ ఇది. స్నేహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు శత్రువులుగా ఎలా మారారు? ఆఖరికి వాళ్లు ఎలా కలుస్తారు? అన్నది చిత్ర కథాంశం.

గతేడాది దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ సొంతం చేసుకుని మంచి కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ఎనిమి ఓటీటీ బాట పట్టింది. ఫిబ్రవరి 18 నుంచి సోనీలివ్‌ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను థియేటర్లలో చూడటం మిస్‌ అయినవాళ్లు ఎంచక్కా ఇంట్లోనే ఓటీటీలో చూసేయండి మరి!

మరిన్ని వార్తలు