దేశంలో మరో 53,601 కరోనా కేసులు

11 Aug, 2020 10:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 53,601 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 871మరణాలు సంభవించాయి. దీంతో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,68,675కి చేరింది. ఇప్పటి వరకు 45,257 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. (చదవండి : అమెరికా తర్వాత భారతే : ట్రంప్‌)

గడిచిన 24 గంటల్లో 47,746 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 15,83,489 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారంవిడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. కాగా, దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు69.80 శాతం ఉండగా.. మరణాల రేటు 1.99 శాతంగా ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

మరిన్ని వార్తలు