కేజ్రీవాల్‌కు మళ్లీ సమన్లు

8 Mar, 2024 06:21 IST|Sakshi

న్యూఢిల్లీ: మద్యం విధానం కుంభకోణం కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై విచారణకు రావాలంటూ ఈడీ పంపిన నోటీసులను పట్టించుకోని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది.

విచారణకు రావాలంటూ జనవరి 12, 31వ తేదీలతోపాటు ఫిబ్రవరి 14వ తేదీన పంపిన 4 నుంచి 8 వరకు సమన్లపై కేజ్రీవాల్‌ స్పందించలేదంటూ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టులో పిటిషన్‌ వేసింది. విచారణ చేపట్టిన జడ్జి దివ్యా మల్హోత్రా ఈ నెల 16వ తేదీన తమ ఎదుట హాజరు కావాలంటూ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేశారు.

Election 2024

మరిన్ని వార్తలు