జైపూర్‌ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. తనిఖీల్లో తేలిందేంటంటే..

16 Feb, 2024 19:20 IST|Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌ రాజధాని నగరం జైపూర్‌లోని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు శుక్రవారం బాంబు బెదిరింపు మెయిల్‌‌ వచ్చింది. ఈ విషయాన్ని ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌ పోలీస్‌ ఇన్స్పెక్టర్‌ ధృవీకరించారు. ఎయిర్‌పోర్టు అధికారిక మెయిల్‌కు బెదిరింపు రావడంతో అప్రమత్తమైనట్లు చెప్పారు. 

బెదిరింపు మెయిల్‌ వచ్చిన వెంటనే ఎయిర్‌పోర్టు మొత్తం సీఐఎస్‌ఎఫ్‌ బలగాలు బాంబు, డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టాయని, ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదని పోలీసులు తెలిపారు. మెయిల్‌ ఎక్కడినుంచి వచ్చిందనేదానిపై సైబర్‌సెల్‌ దర్యాప్తు చేస్తోందని చెప్పారు.  

ఇదీ చదవండి.. కేజ్రీవాల్‌కు గుజరాత్‌ హైకోర్టు షాక్‌ 

whatsapp channel

మరిన్ని వార్తలు